వాషింగ్టన్ : 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని చెప్పారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా సాగుతున్నామన్నారు. ఈక్రమంలో ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకు దాడులు చేయబోమన్నారు. మరో వారం పాటు ఇరాన్‌తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందన్నారు.