నమస్తే

స్వాగతం

NewsOne కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా క్రీడలు వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం
ప్రస్తుతం నడుస్తున్నవి
ప్రధాని మోదీ: నవ ప్రపంచ క్రమానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉంది | కల్కి 2898 AD పార్ట్ 2 రిలీజ్ డేట్ ఖరారు...

విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట

Top Story

ముంబయి : ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు ఊరట కల్పించేందుకు గాను కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌ రుసుములను 25 శాతం తగ్గించుకోవాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల పాటు ఈ తగ్గింపులు కొనసాగించాలని పేర్కొంది. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిరిండియా లకు భారీ దెబ్బ తగిలింది. ఈక్రమంలో విమానాశ్రయాలు వసూలు చేసే కొన్ని రుసుములను తగ్గించేలా చూడమని ఆయా విమానయాన సంస్థలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ ఆదేశాలపై స్పందించింది. ఈ తాత్కాలిక ఛార్జీల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా.. అమెరికా- ఇరాన్‌ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానయాన రంగం పుంజుకుంది. ఇందులోభాగంగా ఇండిగో షేర్లు ఈరోజు ఏకంగా 10శాతం పెరిగి.. అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

లీగల్ వార్తలు

జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై తీర్పు

--- ఈ నెల 22 కీ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టుహైదరాబాద్ :  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 22కి తీర్పును వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై లోతైన విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ ప్రక్రియను తప్పుబడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్.కే. జోషి కోర్టును ఆశ్రయించారు. కమిషన్ తమ వాదనలను సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని, కాబట్టి ఈ నివేదికను రద్దు చేయాలని వారు తమ పిటిషన్లలో కోరారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం మరియు పిటిషనర్ల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్ తీర్పును రిజర్వు చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

వార్తలు

మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంపు

విజయవాడ : మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఫీల్డ్ స్టాఫ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది 2027 జనగణన పనుల్లో నిమగ్నం కావడంతో డీలిమిటేషన్ పనులు ఆలస్యం కానున్నాయి.. రెవెన్యూ సిబ్బంది కూడా జనగణన కార్యకలాపాల్లో ఉండటంతో ప్రస్తుత షెడ్యూల్ అమలు కష్టంగా మారినట్లు అధికారులు మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.. వార్డుల పునర్విభజనలో జనాభా గణాంకాల ఖచ్చితత్వం, ఫీల్డ్ స్థాయి పరిశీలన కీలకమని స్పష్టం చేశారు.. సరిహద్దుల సరిపోల్చడం, భౌగోళిక సవరణలు చేయడానికి మరింత సమయం అవసరమని నిర్ణయం తీసుకుంది మున్సిపల్ శాఖ… తొందరపాటుతో డీలిమిటేషన్ చేస్తే తప్పులు, వివాదాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో కొంత సమయం ఇస్తూ సర్క్యులర్ జారీ చేశారు..ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది మున్సిపల్‌ శాఖ.. చట్టపరమైన అభ్యంతరాలు, అప్పీలు తగ్గించేందుకు కచ్చితమైన ప్రక్రియ పాటించాలని సూచించింది.. గతంలో విడుదలైన షెడ్యూల్‌ను రద్దు చేసి కొత్త షెడ్యూల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు సర్క్యులర్ పంపింది మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ కార్యాలయం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేశారు.. దీంతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది..

వార్తలు

మౌనిక హత్య కేసులో కొత్త కోణం

వడ్లపూడి :  విశాఖపట్నం గాజువాకలో జరిగిన యువతి మౌనిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొదట సాధారణంగా కనిపించిన ఈ ఘటనలో కొత్త కొత్త విషయాలు బయటకు రావడంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, మార్చి 29న మౌనికను ఆమె ప్రియుడు రవీంద్ర హత్య చేసినట్లు తేలింది. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు రవీంద్రను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు మరో ఇంటిని తనిఖీ చేయగా, అక్కడ కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో ఈ హత్య కేసు మరింత క్లిష్టంగా మారింది. నిందితుడు హత్య అనంతరం లొంగిపోవడం కూడా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ హత్యను రవీంద్ర ఒక్కడే చేశాడా? లేక మరెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రవీంద్ర స్నేహితుడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మౌనికను రవీంద్ర తన నివాసంలోనే హత్య చేశాడా? లేక వేరే ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డాడా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు రీ-ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ కేసులో మరెవరెవరి హస్తం ఉందనే అంశంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, పోలీసులు త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.

Ad: news_list_middle
వార్తలు

మహా ముదురుళ్లు

చీటీల పేరుతో 15 కోట్లుతో ఘరానా మోసం తల్లి,కుమారుడిని  అరెస్ట్ చేసిన కంచరపాలెం పోలీసులు ( క్రైమ్ బ్యూరో )చీటీలు పేరుతో కోట్ల మోసం అధిక లాభాల మాయలో ప్రజల నుంచి రూ.15 కోట్లు దోపిడీ కంచరపాలెంలో భారీ చిట్ఫండ్ స్కాం బయటపడింది. ప్రజలను నమ్మించి చీటీల పేరుతో 15 కోట్ల వరకు మోసగించిన కేసులో తల్లి కుమారుడిని కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు  ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం జోగరవు నగర్ కు చెందిన పట్నాల పద్మావతి ఆమె కుమారులు మహేష్,నరేష్ కుమార్,కుమార్తె తిరుమల తో కలిసి 2010 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు.  ఈ ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ అందరితో అందరితో బాగా పరీక్షలు పెంచుకుంది ఆ తర్వాత నెలవారీ,గోల్డ్,దసరా,వరలక్ష్మి చీటీల పేరుతో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది  స్థానికలతో పాటు చుట్టుపక్కల  ప్రాంతాల ప్రజల నుంచి సుమారు 15 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకుండా ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి పరారయింది.*కొద్దిరోజులపాటు గాలించిన వారి ఆచూకీ తెలియకపోవడంతో నగర పోలీస్ కమిషనర్ ను కలిసి పట్నాల పద్మావతి ,ఆమె కుమారులు,కుమార్తె పై ఫిర్యాదు చేశారు.దీంతో సిపి ఆదేశాలు మేరకు కంచరపాలెం సిఐ రవికుమార్ కేసు దర్యాప్తు చేసి నిందితురాలు పట్నాల పద్మావతి,కుమారుడు మహేష్ ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామని కంచరపాలెం సీఐ రవికుమార్ తెలిపారు.. నిందితురాలు దుకాణం వద్ద సోమవారం రాత్రి బాధితులు ఆందోళనలు చేపట్టారు.అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా,అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ, అధిక లాభాల పేరుతో మోసం చేసే చీటీలు, స్కీములపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల వద్ద పెట్టుబడులు పెట్టేముందు పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు.

లీగల్ వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఉండే ఉచిత వైద్య హక్కులు ఏమిటి?

అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినప్పుడు మందులు లేవని బయట కొనమనడం లేదా కొన్ని పరీక్షలు చేయకుండా ఇబ్బంది పెట్టడం మనం చూస్తుంటాం. కానీ చట్టం ప్రకారం రోగికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి.​✅ వాస్తవాలు (The Facts):​ఉచిత మందులు & పరీక్షలు: నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ప్రకారం, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అవసరమైన మందులు, డయాగ్నస్టిక్ పరీక్షలు (Blood tests, X-ray, Scan) ఉచితంగా అందించాలి.​అత్యవసర చికిత్స (Emergency Care): ప్రమాదానికి గురైన వ్యక్తిని ఏ ప్రభుత్వ ఆసుపత్రి కూడా "పోలీస్ కేసు (MLC)" అని చెప్పి చికిత్స నిరాకరించకూడదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ప్రథమ చికిత్స అందించడం వారి విధి.​గోప్యత (Confidentiality): రోగి యొక్క వ్యాధి వివరాలు మరియు రిపోర్టులను వారి అనుమతి లేకుండా ఇతరులకు వెల్లడించకూడదు.​✅ మీరు చేయాల్సినవి (The Solution):​ప్రిస్క్రిప్షన్ అడగండి: డాక్టర్ రాసిన మందులు ఆసుపత్రిలో లేకపోతే, దానికి గల కారణాన్ని రాతపూర్వకంగా అడిగే హక్కు మీకు ఉంది. ఆసుపత్రిలోని 'డ్రగ్ స్టోర్'లో స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేయమని అడగవచ్చు.​ఆరోగ్యశ్రీ/ఆయుష్మాన్ భారత్: మీరు అర్హులైతే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత చికిత్స పొందేందుకు ఈ పథకాలు వర్తిస్తాయి. వారు నిరాకరిస్తే ఆసుపత్రిలోని 'ఆరోగ్య మిత్ర'ను సంప్రదించండి.​ఫిర్యాదు ఎక్కడ చేయాలి?: ఆసుపత్రి సూపరింటెండెంట్ (Superintendent) కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ స్పందన లేకపోతే జిల్లా కలెక్టర్ లేదా '104' హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి.​చార్టర్ ఆఫ్ పేషెంట్ రైట్స్: ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కుల పట్టిక (Patient Charter) ప్రదర్శించాలి. అది లేకపోతే ప్రశ్నించండి.​న్యాయ సలహాలు - అవగాహన కోసం మాత్రమే.

వార్తలు

80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్.

విశాఖపట్నం ( న్యూస్ వన్ ప్రతినిధి ) మార్చి 23  :  విశాఖ లో అక్కయ్యపాలెం సచివాలయం 125  లలితా నగర్ సచివాయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80వేలు లంచం తీసుకుంటూ ఉండగా వార్డు ఎడ్యుకేషన్ కం డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ ను సచివాలయం లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. లలితా నగర్ లో నివాసం ఉంటున్న ద్వారాపురెడ్డి గంగ రాజ్యం అతని కుమారుడు గణేష్ కి రాసిన స్థిరాస్తి సెటిల్ మెంట్ డీడ్ ప్రాసెస్ చేయడానికి 90వేలు లంచం డిమాండ్ చేయగా 80వేలకు ఒప్పందం కుదిరింది.. లంచం ఇవ్వడం ఇష్టం లేని గణేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.. దీనితో రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, కోర్ట్ లో హాజరు పరచనున్నారు.. ఈ దాడుల్లో డి ఎస్ పి లు రమణ మూర్తి, హర్షిత, సి ఐ లు శ్రీనివాస్, వెంకట రావు సిబ్బంది పాల్గొన్నారు.. 1064 టోల్ ఫ్రీ ద్వారా ఏసీబీ నీ సంప్రదించ వచ్చు అని అధికారులు తెలిపారు

Ad: news_list_middle
వార్తలు

ప్రధాని మోడీ ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.విజయవాడ (న్యూస్ వన్ ప్రతినిధి) మర్చి 23 : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధిపతిగా నిరవధికంగా 8,931 రోజుల సేవ పూర్తి చేసిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన నరేంద్ర మోడీ రాజకీయ ప్రయాణం, భారత ప్రధానిగా కొనసాగుతూ దేశానికి విశేష సేవలు అందించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.పదవిలో గడిపిన కాలం మాత్రమే కాకుండా, అచంచల సంకల్పం, అలసటలేని కృషి, దేశ సేవకు అంకితమైన జీవితం ప్రధాని మోడీని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు పవన్‌ కల్యాణ్‌.. “గ్రాస్‌ రూట్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి దేశాన్ని నడిపిస్తూ ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతంతో పాలనకు కొత్త నిర్వచనం ఇచ్చారు” అని పవన్ కల్యాణ్ అన్నారు. రెండు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ, త్యాగం, అపార కృషితో కొనసాగుతున్న నాయకత్వం దేశ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. మౌలిక వసతులు, పేదల సాధికారత, డిజిటల్ మార్పులు వంటి రంగాల్లో ప్రధాని మోడీ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచడంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర కీలకమని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌… ఈ మైలురాయి నిజమైన నాయకత్వం స్థిరత్వం, నిబద్ధత, స్వార్థరహిత సేవపై ఆధారపడుతుందని గుర్తుచేస్తుందని అన్నారు. ఇక, ప్రధాని మోడీకి మరింత ఆరోగ్యం, శక్తి కలగాలని, దేశసేవలో ఇంకా ఎన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్ (ట్వీట్‌) పెట్టారు

సినిమా

5 రోజుల వరకు దాడులు చేయం: ట్రంప్‌

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని చెప్పారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా సాగుతున్నామన్నారు. ఈక్రమంలో ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకు దాడులు చేయబోమన్నారు. మరో వారం పాటు ఇరాన్‌తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందన్నారు.

లీగల్ వార్తలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయారా ?

'కన్స్యూమర్ కోర్టు'లో ఫిర్యాదు చేయడం ఎలా ?మనం ఆన్‌లైన్‌ లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరొకటి రావడం, పాడైపోయిన వస్తువులు రావడం లేదా రీఫండ్ ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటాం. ఇలాంటి సమయాల్లో వినియోగదారుల రక్షణ చట్టం-2019 (Consumer Protection Act) మీకు అండగా ఉంటుంది.✅ వాస్తవాలు (The Facts):ఈ-దాఖల్ (e-Daakhil): వినియోగదారులు ఇప్పుడు కోర్టుకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.రిటర్న్ పాలసీ: కంపెనీలు "వస్తువును వెనక్కి తీసుకోము" అని చెప్పడానికి వీల్లేదు. వస్తువులో లోపం ఉన్నా, ఆర్డర్ చేసిన దానికి భిన్నంగా ఉన్నా కచ్చితంగా మార్చాలి లేదా డబ్బులు వెనక్కి ఇవ్వాలి.తప్పుడు ప్రకటనలు: తప్పుదోవ పట్టించే అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చే కంపెనీలపై భారీ జరిమానాలు విధించే అధికారం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కి ఉంది.✅ మీరు చేయాల్సినవి (The Solution):కస్టమర్ కేర్: మొదట సదరు కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసి, ఆ 'టికెట్ నంబర్' లేదా మెయిల్ కాపీని భద్రపరుచుకోండి.నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్: సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే 1915 కి కాల్ చేయండి లేదా consumerhelpline.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి.కోర్టులో కేసు: అప్పటికీ న్యాయం జరగకపోతే edaakhil.nic.in పోర్టల్‌లో మీరే స్వయంగా కేసు వేయవచ్చు. దీనికి లాయర్ అవసరం లేదు, నామమాత్రపు ఫీజుతో ఫిర్యాదు చేయవచ్చు.అన్‌బాక్సింగ్ వీడియో: ఆన్‌లైన్ పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడూ వీడియో తీయండి. వస్తువు డ్యామేజ్ అయినా లేదా తప్పుగా వచ్చినా ఇది బలమైన సాక్ష్యంగా మారుతుంది.న్యాయ సలహాలు - అవగాహన కోసం మాత్రమే.

Ad: news_list_middle
లీగల్ వార్తలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయారా ?

'కన్స్యూమర్ కోర్టు'లో ఫిర్యాదు చేయడం ఎలా ?మనం ఆన్‌లైన్‌ లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరొకటి రావడం, పాడైపోయిన వస్తువులు రావడం లేదా రీఫండ్ ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటాం. ఇలాంటి సమయాల్లో వినియోగదారుల రక్షణ చట్టం-2019 (Consumer Protection Act) మీకు అండగా ఉంటుంది.✅ వాస్తవాలు (The Facts):ఈ-దాఖల్ (e-Daakhil): వినియోగదారులు ఇప్పుడు కోర్టుకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.రిటర్న్ పాలసీ: కంపెనీలు "వస్తువును వెనక్కి తీసుకోము" అని చెప్పడానికి వీల్లేదు. వస్తువులో లోపం ఉన్నా, ఆర్డర్ చేసిన దానికి భిన్నంగా ఉన్నా కచ్చితంగా మార్చాలి లేదా డబ్బులు వెనక్కి ఇవ్వాలి.తప్పుడు ప్రకటనలు: తప్పుదోవ పట్టించే అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చే కంపెనీలపై భారీ జరిమానాలు విధించే అధికారం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కి ఉంది.✅ మీరు చేయాల్సినవి (The Solution):కస్టమర్ కేర్: మొదట సదరు కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసి, ఆ 'టికెట్ నంబర్' లేదా మెయిల్ కాపీని భద్రపరుచుకోండి.నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్: సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే 1915 కి కాల్ చేయండి లేదా consumerhelpline.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి.కోర్టులో కేసు: అప్పటికీ న్యాయం జరగకపోతే edaakhil.nic.in పోర్టల్‌లో మీరే స్వయంగా కేసు వేయవచ్చు. దీనికి లాయర్ అవసరం లేదు, నామమాత్రపు ఫీజుతో ఫిర్యాదు చేయవచ్చు.అన్‌బాక్సింగ్ వీడియో: ఆన్‌లైన్ పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడూ వీడియో తీయండి. వస్తువు డ్యామేజ్ అయినా లేదా తప్పుగా వచ్చినా ఇది బలమైన సాక్ష్యంగా మారుతుంది.న్యాయ సలహాలు - అవగాహన కోసం మాత్రమే.

హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)